యుటిఐ మాజీ చైర్మన్అరెస్టు
న్యూఢిల్లీ:యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యుటిఐ) మాజీ చైర్మన్పి.ఎస్. సుబ్రహ్మణ్యంను సిబిఐ ఆర్థిక నేరాల విభాగం శనివారంముంబాయిలో అరెస్టు చేసింది. రూ. 328 మిలియన్లప్రజాధనం విషయంలో అవకతవకలకు పాల్పడ్డారనేఆరోపణపై సిబిఐ సుబ్రహ్మణ్యంను అరెస్టుచేసింది.
సుబ్రహ్మణ్యంను ఈనెల 27వ తేదీ వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ చేస్తూ ప్రత్యేకన్యాయమూర్తి ఎస్.ఆర్. మెహ్రా ఆదేశాలు జారీచేశారు. యుటిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ఎం.ఎం. కపూర్, ఎస్.కె. బసులను, రినాయెజన్స్ సెక్యూరిటీస్కుచెందిన స్టాక్ బ్రోకర్ రాకేష్ మెహతాలను కూడా 27వ తేదీవరకు రిమాండ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. వీరిని కూడా శనివారంనాడే అరెస్టుచేశారు.
కుట్ర,చీటింగ్, కార్యాలయ దుర్వినియోగం,ప్రజాధనం దుర్వినియోగాల కింద సుబ్రహ్మణ్యం,కపూర్, బసు, మధుప్రసాద్, మెహతాలపై సిబిఐ కేసులునమోదు చేసింది.