మూడు జిల్లా పరిషత్లపై ఆసక్తి
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని మూడు జిల్లా పరిషత్లకు శనివారం జరిగే ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు జరగాల్సిన మూడు జిల్లా పరిషత్ల ఎన్నికలు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడిన షయం తెలిసిందే. కరీంనగర్, రంగారెడ్డి, చిత్తూరు జిల్లా పరిషత్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. dటిని కైవసం చేసుకోవడానికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. కరీంనగర్, రంగారెడ్డి జిల్లా పరిషత్ల ఎన్నికలు మళ్లీ వాయిదా పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇదిలావుంటే, కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రధాన పార్టీల జడ్పిటిసి సభ్యులెవరూ జిల్లా కేంద్రంలో లేరు. జడ్పిటిసి సభ్యులు జారిపోకుండా రాజకీయ పార్టీలు యాత్రలు నిర్వహించాయి. కాంగ్రెస్ సభ్యులు షిర్డీ యాత్రలో వుండగా, తెలంగాణా రాష్ట్ర సుతి (టిఆర్ఎస్) సభ్యులు తిరుపతిలో పూజలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు గోవాలో వున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిజెపి సభ్యులు టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వవచ్చు.
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యుడు కె. భాస్కర్ కనిపించకుండా పోయారు. భాస్కర్ను తెలుగుదేశం పార్టీ కిడ్నాప్ చేసిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. dరిని పోలీసులు అరెస్టు చేశారు. భాస్కర్ వ్యవహారం ఇలా వుంటే మరో కాంగ్రెస్ సభ్యుడు రాజీనామా చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లా పరిషత్ తెలుగుదేశం కైవసం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, రాజీనామా చేశారంటున్న తమ సభ్యుడు పదd ప్రమాణమే చేయలేదని కాంగ్రెస్నాయకులంటున్నారు. రాజీనామా చేసిన వ్యక్తి తమ సభ్యుడు అవునో కాదో తేల్చాలంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కుషన్కు ఫిర్యాదు చేశారు.
చిత్తూరు
కాంగ్రెస్
జడ్పిటిసి
సభ్యుల్లో
తలెత్తిన
భేదాలు
సద్దుమణిగాయి.
ప్రదేశ్
కాంగ్రెస్
కుటీ
(పిసిసి)
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణరావు
శుక్రవారం
తిరుపతి
వెళ్లి
ఇరు
వర్గాల
మధ్య
రాజీ
కుదిర్చారు.
దీంతో
చిత్తూరు
జిల్లా
పరిషత్
కాంగ్రెస్
హస్తగతం
అయ్యే
సూచనలు
కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్కు
ఇక్కడ
ఒకే
ఒక
సభ్యుడు
తెలుగుదేశం
కన్నా
అధికంగా
వున్నాడు.
దీంతో
ఇక్కడి
ఎన్నికపై
కూడా
ఉత్కంఠ
నెలకొంది.