వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం విదేశీ సంస్థల మూసివేత

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సత్యం కంప్యూటర్స్‌ తన కార్యకలాపాలను పెద్ద ఎత్తున పునర్‌వ్యవస్ఖీకరిస్తున్నది. ఇందులో భాగంగా సంస్థ నాలుగు అనుబంధ సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. సత్యం యూరప్‌, సత్యం జపాన్‌, సత్యం ఆసియా పసిఫిక్‌ మార్కెటింగ్‌ సంస్థలను మూసివేయాలని సత్యం కంప్యూటర్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం నిర్ణయించింది.

ఈ మూడు సంస్థలతో పాటు వై2కె కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ మిలీనియం ఐఎన్‌సి. ని కూడా సత్యం మూసివేస్తున్నది. వై2కె సమస్యకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ అవసరం ఇప్పుడు లేదని సత్యం పేర్కొంది. కాగా యూరప్‌, ఆసియాపసిఫిక్‌, జపాన్‌లో మార్కెటింగ్‌ కార్యకలాపాలను ఇకనుంచి సత్యం కంప్యూటర్స్‌ ప్రధాన సంస్థనే నేరుగా చేపడుతుంది. స్థానికంగా కస్టమర్లను సంపాదించడానికి, స్థానిక రిక్రూట్‌మెంట్లకోసం వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడానికి వీలుగా తొలుత అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాల్సివచ్చిందని సత్యం పేర్కొంది.

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లో లిస్టింగ్‌ తర్వాత ప్రత్యేక అనుబంధం సంస్థలను కొనసాగించాల్సిన అవసరం ఇక లేని కారణంగా వాటిని మూసివేస్తున్నట్టుగా సత్యం వెల్లడించింది. ఈ మూసివేతల వల్ల ఎంతమంది ఉద్యోగులను తొలిగించాల్సివస్తున్నది మాత్రం సత్యం వెల్లడించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X