వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రమంతా ఇ-సేవ: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇ-సేవ కార్యక్రమాలను త్వరలోఅందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. గవర్నర్‌సి. రంగరాజన్‌ శనివారం ఇ-సేవ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ఆవిషయం చెప్పారు. ఇంటర్నెట్‌ ద్వారా అన్ని శాఖలను అనుసంధానించే కార్యక్రమం త్వరలో పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ సౌకర్యంఅందుబాటులోకి వస్తే ప్రజలు కరెంట్‌, టెలిఫోన్‌ బిల్లులను, తదితర బిల్లులను ఇంటర్నెట్‌ ద్వారా చెల్లించవచ్చునని, బస్సు,రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చునని ఆయన చెప్పారు.

ఇంటర్నెట్‌ ద్వారా 30 ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయాలను అనుసంధించానున్నట్లు ఆయన తెలిపారు. ఇ-సేవ ప్రాజెక్టులను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. టాటా కన్సల్టెన్సీ ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తోందని ఆయన చెప్పారు. డేటాసెంటర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్‌ రంగరాజన్‌ కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సాంకేతిక పరిజ్ఞానం వారధిగా పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంఅందుబాటులోకి రావడంతోనే సరిపోదని, దాన్ని వాడే సిబ్బంది సమర్థతపెరగాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X