హెరిటేజ్ ప్రాంతంగా పాతనగరం
హైదరాబాద్ః
హైదరాబాద్
పాతబస్తీ
ప్రాంతాన్ని
హెరిటేజ్
ప్రాంతంగా
ప్రకటించే
ఆలోచనలో
ప్రభుత్వం
వుంది.
ఈ
విషయం
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
శనివారం
నాడు
వెల్లడించారు.
శనివారం నాడు ముఖ్యమంత్రి అధికారులు పాతబస్తీ ప్రజాప్రతినిధులతో కలసి అకస్మాత్తుగా పాతబస్తీని సందర్శించారు. చార్మినార్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసిన తర్వాత, వక్ఫ్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలను 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.
జంటనగరాల్లోని చెరువులు, కుంటలను 260 కోట్ల రూపాయలతో పునర్నిర్మించనున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఈ పర్యటనలో ప్రజాసమస్యల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుని పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. పురాతన కట్టడాలను, చారిత్రక ప్రదేశాలను పరిరక్షించాల్సిన బాధ్యతఅందరిపై వున్నదని ఆయన చెప్పారు