మలేరియా నివారణకు ప్రత్యేక బృందాలు
నిజామాబాద్: మలేరియా వ్యాధి ప్రబలిన వివిధ జిల్లాలకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శనక్కాయలఅరుణ చెప్పారు. మలేరియా వ్యాధి నివారణకు వైద్యులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ జిల్లాల్లో పర్యటిస్తారని ఆమెవిలేకరులతో చెప్పారు. శనివారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిఅరుణకు చేదు అనుభవం ఎదురయింది. నబీపేటలో ప్రజలు ఆమె నిలదీశారు. తాము కుక్కకాటుకు గురవుతుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందు లేదని వైద్యులు చెప్పడంపై ప్రజలు ఆమెను నిలదీశారు. ఈవిషయంపై ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై మండిపడ్డారు.
మలేరియా వ్యాధి నివారణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనేవిమర్శలను ఆమె కొట్టి వేశారు. ప్రభుత్వం మలేరియా వ్యాధి నివారణకు అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆమె చెప్పారు. నిజామాబాద్లోని ఆస్పత్రిలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన కంటి చికిత్సా విభాగాన్ని ఆమె ప్రారంభించారు.