వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కినేనికి విశాఖలోస్వర్ణకంకణం

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నంః దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుకు సౌందర్య లహరి సాంస్కృతిక సంస్థ స్వర్ణ కంకణం ప్రదానం చేసింది. విశాకపట్నంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో అక్కినేనికి స్వర్ణకంకణం ప్రదానం చేశారు.

ఐదు దశాబ్దాలుగా తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకుఅక్కినేని అభివాదం చేశారు. నటుడికి ప్రేక్షకుడి ఆదరణే ప్రాణప్రదమైనదనిఅక్కినేని అన్నారు. తనకు ఎన్ని అవార్డులు వచ్చినప్పటికీ సొంతగడ్డపైఅందుకుంటున్న ఈ స్వర్ణకంకణం అన్నికంటే పెద్ద సత్కారం అని ఆయన అన్నారు.

సౌందర్య లహరి సంస్థ తెలుగు చలనచిత్ర రంగానికివిశేష సేవలందించిన వారికి ఈ స్వర్ణ కంకణాన్ని బహూకరిస్తున్నది. ఈ సంస్థ గతంలో గాయని జానకి, దర్శకుడుకె. విశ్వనాధ్‌ కు స్వర్ణ కంకణాన్ని బహూకరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X