పలువురిపై వేటు-కొత్త వారికి చోటు
న్యూఢిల్లీః
ప్రధాని
వాజ్పేయి
ఎంతో
సాహసంతో
సంకీర్ణ
ప్రభుత్వంలో
వుండే
తల
నొప్పులను
పక్కనపెట్టి
యువతరానికి,
కొత్తదనానికి,
సంస్కరణలకుపెద్దపీట
వేస్తూ
మంత్రివర్గంలో
మార్పులు
చేర్పులు
చేశారు.
పెట్టుబడుల
ఉపసంహరణల
శాఖ
మంత్రిఅరుణ్
శౌరి,
షా
నవాజ్
లకు
క్యాబినెట్
మంత్రులుగా
ప్రమోషన్
ఇచ్చారు.
శరద్
యాదవ్
ను
కీలకమైన
పౌరవిమానయాన
శాఖ
నుంచి
బొగ్గు,
గనుల
శాఖకు
బదిలీ
చేశారు.
అదే
విధంగా
రాంవిలాస్
పాశ్వాన్
ను
టెలికమ్యూనికేషన్
శాఖ
నుంచి
కార్మిక
శాఖకు
బదిలీ
చేసి
పనితీరు
సరిగా
లేకుంటే
ఊరుకొనేది
లేదని
మంత్రులకు
హెచ్చరిక
చేశారు.
కరియా ముండా, వేద్ ప్రకాష్ గోయల్ ను కేబినెట్ హోదా కల్పించి కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.విజయ్ గోయల్, రాజీవ్ ప్రతాపా రూజీ, రవిశంకర్ ప్రసాద్, అన్నాసాహెబ్ పాటిల్ సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కొత్త ముఖాలు. ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో నూతన మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
వాజ్
పేయి
నిర్ణయంపై
పాశ్వాన్,
శరద్
యాదవ్
అలకపాన్పు
ఎక్కినప్పటికీ
వాజ్పేయి
తెగింపు
ధోరణి
చూపడంతో
చేసేది
లేక
రాజీకి
వచ్చారు.
కమ్యూనికేషన్ల
శాఖ
ను
పార్లమెంటరీ
వ్యవహారాల
శాఖ
మంత్రి
ప్రమోద్
మహాజన్
కుఅప్పగించారు.
ఇంకా
పలు
శాఖల్లో
ప్రధాని
భారీ
మార్పులు
చేశారు.
యువతకు,
పనితీరుకు
ప్రాధాన్యత
కల్పించిన
ప్రధాని
యు.పి.
ఎన్నికలను
దృష్టిలో
వుంచుకొని
ఆ
రాష్ట్రానికి
చెందిన
ముగ్గురు
నేతలకు
మంత్రివర్గలో
స్థానం
కల్పించడంవిశేషం.