వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ ఓటమి -సిరీస్‌ లంక పరం

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబోః శ్రీలంకతో జరుగుతున్న మూడోటెస్ట్‌ లో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్‌ 77 పరుగుల తేడాతో గంగూలీ బృందాన్ని శ్రీలంక జట్టు చిత్తుగా ఓడించింది. రనౌట్లు,విశ్వాసం లేని బ్యాటింగ్‌, పసలేని పిచ్‌ లో కూడా అద్భుతాలు సృష్టించే శ్రీలంక బౌలర్ల ప్రతాపం భారత్‌ ను చిత్తు చేశాయి. 2-1 తేడాతోటెస్ట్‌ సిరీస్‌ ను శ్రీలంక కైవసం చేసుకుంది. భారత్‌ పైటెస్ట్‌ మ్యాచ్‌ లలో శ్రీలంక సిరీస్‌ గెలుచుకోవడం 16 సంవత్సరాల తరువాత ఇదే ప్రధమం.

శ్రీలంకను బ్యాటింగ్‌ కు దించేందుకు 376 పరుగులు చేయాల్సిన భారత్‌ 299 పరుగులకు ఆలౌట్‌అయింది. దీనితో శ్రీలంక ఇన్నింగ్స్‌ 77 పరుగుల తేడాతో భారత్‌ పై ఘనవిజయం సాధించింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ముత్తయ్య మురళీ ధరన్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ దక్కాయి. భారత్‌ పరువు దక్కించేందుకు టెయిల్‌ ఎండర్‌ జహీర్‌ఖాన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు 45 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

సచిన్‌, లక్ష్మణ్‌ వంటి మేటి బ్యాట్స్‌ మెన్‌, శ్రీనాధ్‌, కుంబ్లే వంటి బౌలర్లు లేనప్పటికీ శ్రీలంక చేతిలో ఇంతటిఘోర పరాజయం పాలవ్వడం గంగూలీ బృందానికి నిజంగా తీరని అవమానం. కెప్టెన్‌ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గంగూలీ సిరీస్‌ కోల్పోవడం కూడా ఇదే ప్రథమం. త్వరలో దక్షిణాఫ్రికా సిరీస్‌ లో భారత్‌ కాస్త మనస్థైర్యంతో ఆడుతుందని ఆశిద్దాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X