పాక్ రెండు నాల్కల ధోరణిః ఫరూఖ్
న్యూఢిల్లీః
భారత
దేశంలో
ఉగ్రవాదానికి
ఊతం
ఇచ్చే
వైఖరికిస్వస్తి
చెప్పనంత
వరకు
పాకిస్తాన్
భారత్
తో
చర్చలు
జరిపి
ప్రయోజనం
లేదని
జమ్మూకాశ్మీర్
ముఖ్యమంత్రి
ఫరూఖ్
అబ్దుల్లా
అన్నారు.
ప్రపంచ
దేశాలు
నిరసిస్తున్నా,
భారత్
తీవ్రంగా
వ్యతిరేకిస్తున్నా
పాకిస్తాన్
సీమాంతర
ఉగ్రవాదానికి
ఊతం
ఇస్తునే
వున్నదని
ఆదివారం
ఆయనవిలేకరుల
సమావేశంలో
విమర్శించారు.
ఓ
వైపు
ఉగ్రవాదాన్ని
సమర్థిస్తూ
మరోపైవు
భారత్
తో
చర్చలు
జరుపడంలోఅర్థం
లేదని
ఆయన
అన్నారు.
న్యూయార్క్ లో వాజ్పేయి- ముషారఫ్ ల మధ్య జరిగే చర్చలైనా సఫలం కావాలని ఫరూఖ్ ఆకాంక్షించారు. ముషారఫ్ ఈసారైనా సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడాలని ఫరూఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరిని విడనాడి ఉగ్రవాదానికిస్వస్తి చెప్పినప్పుడే పాకిస్తాన్ మాటకు విలువ వుంటుందని ఆయన అన్నారు.
కాశ్మీర్ లో హురియత్ వైఖరిని పట్టించుకొనే వారు లేరని ఆయన అన్నారు. హురియత్ అంతర్జాతీయ మద్దతు కోసం అర్రలు చాస్తున్నా త్వరలో కాశ్మీర్ ప్రజలు హురియత్ నేతలను తరిమి కొడతారని ఆయన అన్నారు.