వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేటలో ఎమ్మెస్సార్‌ ధర్నా

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండః నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీస్టేషన్‌ ఎదుట పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు ధర్నా చేశారు. రాజకీయ కక్షల కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎరుకల వీరయ్య శనివారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆదివారం సూర్యాపేట వచ్చిన ఎమ్మెస్సార్‌ పోలీసులను డిమాండ్‌ చేశారు. పోలీసు స్పందనకు నిరసనగా ఆయన ఆకస్మకంగా సూర్యాపేట పోలీస్టేషన్‌ ఎదుట ధర్నా ప్రారంభించారు.

శనివారం గణేష్‌ నిమజ్జనం సందర్భంగా సూర్యాపేటలో ఘర్షణ చెలరేగింది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినప్పటికీ ఘర్షణలు ఆగలేదు. ఈ ఘర్షణల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందినవిద్యా కమిటీ నాయకుడు వీరయ్య మరణించాడు. ఇది తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాల్లో భాగమని ఎమ్మెస్సార్‌విమర్శించారు. అందుకు నిరసనగా ధర్నా ప్రారంభించారు. అయితే ఈ హత్యపై పూర్తి స్థాయివిచారణ జరిపించి దోషుల్ని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఏమ్మెస్సార్‌ దీక్షవిరమించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X