ప్రధానిగా సోనియాః కోట్ల ఆకాంక్ష
హైదరాబాద్ః భారత ప్రధానిగా సోనియాగాంధీని చూడాలన్నదే తన ఆకాంక్ష అని కోట్ల విజయభాస్కరరెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు తనను పరామర్శించడానికి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ అందజేశారు.
ఆ లేఖలో సోనియాను ఈ దేశ ప్రధానిగా చూడాలన్నదే తన అభిమతమని ఆయనపేర్కొన్నారు. దేశం మొత్తంమీద కాంగ్రెస్ పవనాలు బలంగావీస్తున్నాయని కోట్ల అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలతో ప్రజలువిసిగిపోయారని ఆయన తెలిపారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ బలోపేతమైన సంస్థగా రూపుదిద్దుకున్నదని కూడా ఆ లేఖలో సూచించారు. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications