వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌ సదస్సుకు మంతనాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత ప్రధాని వాజ్‌పేయి, పాకిస్తాన్‌ నేత ముషారఫ్‌ మధ్య న్యూయార్క్‌లో జరుగనున్న శిఖరాగ్ర సభకు సంబంధించి ఉభయదేశాలు చురుగ్గా మంతనాలు ప్రారంభించాయి. ఆగ్రా సదస్సు వైఫల్యానికి బాధ్యత మీదంటే మీదంటూ గత కొద్ది రోజులుగా పరుష పదజాలంతో రెండు దేశాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న విషయం విదితమే.

ఈ వాగ్యుద్ధం తీవ్రతను గమనించినవారు న్యూయార్క్‌ శిఖరాగ్రంపై అనుమానాలు వ్యక్తం చేశారు కూడా. పాకిస్తాన్‌ హై కమిషనర్‌ ఆర్‌ ఎస్‌ కల్హా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శ ఆర్‌ఎస్‌ కల్హాను కలుసుకుని సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఇస్లామాబాద్‌లో కూడా భారత హై కమిషనర్‌విజయ్‌ కె నంబియార్‌ పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ అధికారులను కలుసుకుని చర్చలు జరిపారు. చర్చలకు సంబంధించిన ఎజెండాను ఖరారు చేయడానికి కూడా ఈ రెండు దేశాల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
. .

సమ్మెకట్టిన రెవిన్యూసిబ్బంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X