వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు ఇంధనంపైవిమర్శలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికావిమానం ఇంధనం దింపుకోవడానికి ఢిల్లీలో దిగడంపైవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా విమానాలు దిగడానికి అనుమతి ఇవ్వలేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రకటించిన మర్నాడే ఈ సంఘటన జరగడంపై ప్రతిపక్షాలువిమర్శలు కురిపిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్‌విమర్శించింది. వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఈవిషయమై చర్చించాలని కాంగ్రెస్‌ నాయకుడు ఎడ్వర్డ్‌ఫెలిరో డిమాండ్‌ చేశారు. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికావిమానాన్ని ఇంధనం నింపుకోవడానికి అనుమతించడంపైకమ్యూనిస్టు నాయకుడు రాజా విమర్శించారు.

ఇదిలా వుంటే, జాతీయ ప్రజాస్వామ్య కూటమి భాగస్వామ్య పక్షాలు ఈ సంఘటనను సమర్థించాయి. అమెరికాసైనిక విమానాలు దిగడానికి సౌకర్యాలు కల్పించడం అసాధరణమేమీ కాదని సమతా పార్టీ, జనతాదళ్‌ (యు) అన్నాయి. తీవ్రవాదం అణచివేతకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ఎన్‌డిఎ ప్రధానికి అధికారం ఇచ్చిందని సమతా పార్టీ అధికార ప్రతినిధి శంభు శ్రీవాస్తవ అన్నారు. అమెరికావిమానం ఇంధనం నింపుకోవడానికి ఢిల్లీలో దిగడాన్ని జెడి (యు) ప్రధాన కార్యదర్శి మోహన్‌ ప్రకాశ్‌ సమర్థించారు.

అయితే, అమెరికా విమానం ఇంధనం నింపుకోవడానికి ఢిల్లీలో దిగలేదని, ఐదుగురు దౌత్యవేత్తలను దింపి వెళ్లిపోయిందని ప్రభుత్వంఅంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X