వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదంబం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కాశ్మీర్‌అసెంబ్లీపై జరిగిన దాడి పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నదనడానికి నిదర్శనంఅంటూ వాజ్‌ పేయి అమెరికా అధ్యక్షుడు బుష్‌ కు లేఖరాశారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలే ఈ ఘాతుకానికి కారణం అని, పాకిస్తాన్‌ ఈ తీవ్రవాద సంస్థలకు ఊతం ఇస్తున్నదంటూ భారత ప్రధాని వాజ్‌పేయి బుష్‌ కు రాసిన లేఖలో వివరించారు. పాకిస్తాన్‌ ఏ తీవ్రవాద సంస్థకు అండగా నిలవడం లేదని పాక్‌ సైనికాధ్యక్షుడు ముషారఫ్‌ ప్రకటించి 24 గంటలు గడవక ముందే కాశ్మీర్‌ లో నరమేధం జరిగిందని వాజ్‌పేయి బుష్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

కాశ్మీర్‌ లో తీవ్రవాదులు సృష్టించిన నరమేధం గురించి అమెరికాలో పర్యటిస్తున్న భారత్‌ విదేశాంగ, రక్షణ శాఖ మంత్రి జస్వంత్‌ సింగ్‌ ఆ దేశ అధ్యక్షుడు బుష్‌ కువివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా జస్వంత్‌ సింగ్‌ అధ్యక్షుడు బుష్‌ తో పాటు పలువురు విదేశాంగ, రక్షణ శాఖ ప్రముఖులను కలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X