వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ తో బేషరతు చర్చలు లేవుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఆయనకు ఘనంగా నివాళులుఅర్పించారు. రాష్ట్ర రాజధాని లోని అసెంబ్లీ హాల్‌ లో వున్న భారీ గాంధీవిగ్రహానికి స్పీకర్‌ ప్రతిభా భారతి ఘన నివాళులుఅర్పించారు. బాపూఘాట్‌ వద్ద జాతిపితకు గవర్నర్‌ రంజరాజన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు తదితర ప్రముఖులు నివాళులుఅర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా బాపూ ఘాట్‌ వద్ద మొక్కలు నాటి,సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తున్న తీవ్రవాదంపైఅంతా ఆలోచించాల్సిన అవసరం వున్నదని అన్నారు. రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ఆయన వెల్లడించారు. అయితే నక్సలైట్లతో బేషరతు చర్చలు మాత్రం జరిపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన్‌ కార్యాలయంఅయిన గాంధీభవన్‌ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు జాతిపితకు ఘనంగా నివాళులుఅర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X