కాశ్మీర్ పాపం పాకిస్తాన్ దేః ఫరూఖ్
శ్రీనగర్ః
కాశ్మీర్అసెంబ్లీ
వెలుపల
సోమవారం
జరిగిన
మారణకాండకు
పాకిస్తాన్
ఊతం
ఇస్తున్న
జైషీర్
మహమ్మద్
తీవ్రవాద
సంస్థే
కారణం
అని
కాశ్మీర్
ముఖ్యమంత్రి
ఫరూఖ్
అబ్దుల్లా
వెల్లడించారు.
42
మందిని
పొట్టనపెట్టుకున్న
ఈ
సంఘటన
వెనుక
పాకిస్తాన్
హస్తం
వున్నదని
ఆయన
ఆరోపించారు.
పాక్
ఆడుతున్న
ఈ
నాటకాన్ని
చూస్తూ
ఊరుకొనేది
లేదని
ప్రతీకారం
తీర్చుకుంటామని
ఆయన
హెచ్చరించారు.
కాశ్మీర్అసెంబ్లీలో తీవ్రవాదాలు సోమవారం నాడు పేలుళ్ళు సృష్టించడంతో పాటు నాలుగు గంటల పాటు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కుపెరిగింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణంలో పాల్గొన్న వారిలో ఇద్దరు పాకిస్తానీయులు వున్నారని ఫరూఖ్ వెల్లడించారు. శ్రీనగర్అసెంబ్లీలో జరిగిన మారణకాండను పరిశీలించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీ బుధవారం ఇక్కడకు రానున్నారు.