వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరవళ్ళు తొక్కుతున్న కృష్ణానది
విజయవాడః గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్ళు తొక్కుతున్నది. వరదనీరు ఉదృతంగా వచ్చి చేరడంతో సోమవారం తెల్లవారు జామున ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది క్రస్ట్ గేట్లన్నీ ఎత్తి వేశారు. వర్షాకాలం ప్రారంభంఅయిన నాటి నుంచి క్రస్ట్ గేట్లు అన్నీ ఎత్తివేయడం ఇదే ప్రథమం.
క్రస్ట్ గేట్లన్నీ ఎత్తి వేయడంతో కృష్ణమ్మ సోయగాలు ఒలకబోస్తూ ప్రవహిస్తున్నది. ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు చిరుజల్లుల మధ్య కూడా వందలాది మంది ప్రజలు ప్రకాశం బ్యారేజ్ కు తరలి వచ్చారు.
ప్రజలు
తరలి
రావడంతో
ప్రకాశం
బ్యారేజ్
పై
తరచు
ట్రాఫిక్
స్థంభించింది.
మొత్తంమీద
ఆ
దృశ్యం
కృష్ణమ్మ
తిరునాళ్ళు
జరుగుతున్నట్లుగా
అనిపించింది.
నిన్న
మొన్నటి
వరకు
నీళ్ళు
లేక
వెలవెలపోతున్న
కృష్ణానది
ఈ
వానలతో
నిండుగా
ప్రవహిస్తున్నది.
Comments
Story first published: Tuesday, October 2, 2001, 23:53 [IST]