వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడేళ్ళలో పల్లెపల్లెనావిద్యుత్
హైదరాబాద్ః రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల గురించి చర్చించేందుకు సోమవారం సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కరవు పరిస్థితుల్లోపెద్దగా మార్పు రాదని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు సమగ్రంగా.....
- రాష్ట్రంలోని 15 వేల గ్రామాలు, కాలనీల విద్యుదీకరణకు 483 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్.
- విద్యుత్ చౌర్యంపై విధించే జరిమానా తగ్గింపు. కాంపౌండింగ్ ఫీజు, సర్ ఛార్జీల హేతుబద్ధీకరణ.
- మైనారిటీ కమిషన్ తరహాలా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫారసుకు ఆమోద ముద్ర.
- ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్ల ఏర్పాటు.
-
కాంట్రాక్టు
పద్ధతిపై
పలు
ఉద్యోగాల
భర్తీకి
గ్రీన్
సిగ్నల్.
ఏడాది చివరకల్లా అన్ని చోట్లా స్పాట్ బిల్లింగ్ పద్ధతి అమలు. - జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు నవంబర్ ఒకటి నుంచి అమలు.
- దళితులు ప్రతినెలా 30 వ తేదీన పౌరహక్కుల దినోత్సవం జరుపుకొనేందుకు ఆదేశాలు జారీ.
- జూనియర్ డాక్టర్ల డిమాండ్లకు ఆమోద ముద్ర.
Comments
Story first published: Tuesday, October 2, 2001, 23:53 [IST]