కోలుకుంటున్న నెల్లూరు, కడప
హైదరాబాద్ః తుపాను కబంధహస్తాల్లో చిక్కి విలవిలలాడిన నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలు క్రమంగా కోలుకుంటున్నాయి. తుపాను భయంతో కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన నెల్లూరు, కడప జిల్లా వాసులు క్రమంగాస్వస్థలాలకు చేరుకొని నష్టాలు అంచనా వేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోపెన్నానది కొంత శాంతించింది. నెల్లూరు - చెన్నయ్ ల మధ్య జాతీయ రహదారిపై తేలిక పాటి వాహనాల రాకపోకలను శనివారం నాడు అనుమతించారు.
కడప
జిల్లా
కూడా
మెల్లిగా
కోలుకుంటున్నది.
కేంద్ర
మంత్రి
బండారు
దత్తాత్రేయ,
రాష్ట్ర
పంచాయతీ
రాజ్
శాఖ
మంత్రి
పోచారం
శ్రీనివాసరెడ్డి
శనివారం
నాడు
కడప
జిల్లాలో
విస్తృతంగా
పర్యటించారు.
సహయ
చర్యలను
పర్యవేక్షించారు.
కడప
జిల్లాకు
వెయ్యి
పక్కా
గృహాలను
మంజూరు
చేయిస్తానని
బండారు
దత్తాత్రేయ
హామీ
ఇచ్చారు.
అనంతపురం
జిల్లాలో
భారీ
వర్షాల
కారణంగా
కనీసం
2,500
ఇళ్లు
పూర్తిగా,
10వేలకుపైగా
ఇళ్ళు
పాక్షిగంగా
దెబ్బ
తిన్నాయి.
పంటలుసర్వనాశనం
అయ్యాయి.