వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ బుద్ధి మారలేదుః ఫెర్నాండెజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

సియాచిన్‌ ః భారత్‌ కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తునే వున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌విమర్శించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా బుద్ధి మార్చుకోని పాకిస్తాన్‌ ఆటకట్టించేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నాడు సియాచిన్‌సైనిక స్థావరంలో భారత సైన్యాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

కేవలం వైమానిక దాడుల వల్ల తీవ్రవాదం సమసి పోదు... ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన సియాచిన్‌సైనిక స్థావరాన్ని ఫెర్నాండెజ్‌ శనివారం సందర్శించారు. దశాబ్ది కాలంగా ఈ తీవ్రవాదం గురించి భారత్‌ ప్రపంచదేశాలను హెచ్చరిస్తునే వుంది.. వారికి అనుభవపూర్వకంగా తెలిశాక గానీ తీవ్రత తెలిసి రాలేదని ఆయన అన్నారు. ఎన్ని సార్లు హెచ్చరించినా తీవ్రవాదులకు డబ్బు, శిక్షణ, ఆయుధాలను పాక్‌అందిస్తునే వున్నదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X