అంత్రాక్స్ కేసులో హైదరాబాదీలు
న్యూయార్క్ః న్యూయార్క్పై దాడులకు సంబంధించిన కేసులో అనుమానితులుగా అరెస్టయిన హైదరాబాద్ యువకులు ఆయూబ్ అలీ ఖాన్, మహమ్మద్ జావిద్ అజ్మత్లకు అంత్రాక్స్ వ్యాప్తిలో కూడా సంబంధం వున్నదని అమెరికా అనుమానిస్తున్నది.
జెర్సీ నగరంలోనివీరి అపార్ట్మెంట్లో దొరిగిన మ్యాగజైన్స్లో బయోవార్కు సంబంధించిన కథనాలు వుండటం,విషవాయువులు, జీవాయుధాలకు సంబంధించిన కథనాలతో వారివద్ద పత్రికలు వుండటం అనుమానాలకు తావిస్తున్నదనిఅంటున్నారు. అదీ కాకుండా వీరి రూమ్మెట్గా వున్న పాకిస్తానీ జాతీయుడు మహమ్మద్అస్లాం పర్వేజ్ కొంత కాలం పనిచేసిన ట్రెంటన్ న్యూస్స్టాండ్ సమీపంలోని పోస్టాఫీసులోనే ఈఅంత్రాక్స్ కవర్లు ప్రాసెస్ అయ్యాయి.
వీటన్నింటిని కలుపుకునిచూస్తే హైదరాబాదీ యువకులకు అంత్రాక్స్ భీతిని వ్యాపింప జేయడంలో పాత్ర వున్నదని అనుమానించాల్సి వస్తున్నదని ఎఫ్బిఐ అధికారులుఅంటున్నారు. అయితే నిజానికి వీరిద్దరినీ అరెస్టు చేసిన తర్వాతనేఅంత్రాక్స్ వ్యవహారం ప్రారంభమైంది.