19 నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు వచ్చే నెల 19వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 21వ తేదీ వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ చెప్పారు. ఈ మొత్తం 33 రోజుల్లో సమావేశాలుసెలవులు పోను 23 రోజులు జరుగుతాయని ఆయన అన్నారు. ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి అధ్యక్షతన గురువారం మంత్రి వర్గ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఖరారు చేశామని ఆయన చెప్పారు.
ఈ సమావేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెడుతుంది. ఈ బిల్లును ప్రతిపక్షాలు ఆమోదించగలవనే ఆశాభావాన్ని ప్రమోద్ మహాజన్ వ్యక్తం చేశారు.
కాగా, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ మద్దతు అవసరమవుతుంది. టాడా కాలపరిమితి ముగియడంతో దానికి మరిన్ని సవవరణలు చేసి ప్రభుత్వం ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆర్డినెన్స్ను తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం తీవ్రవాదుల సమాచారం తెలిసి కూడా చెప్పకపోయినా నేరమే అవుతుంది.అంతేకాకుండా ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలను నిషేధించింది. ఇందులోపీపుల్స్వార్ లేదు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జార్జి ఫెర్నాండెజ్కు తిరిగి రక్షణ శాఖను కట్టబెట్టడంపై ప్రతిపక్షాలుపెద్ద యెత్తున దాడి చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండాఅఎn్ఘానిస్థాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ, దౌత్య సంబంధమైనఅంశాలు ప్రస్తావనకు రావచ్చునని అనుకుంటోంది.