వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరాంచల్ సిఎంకుఉద్వాసన
న్యూఢిల్లీ: ఉత్తరాంచల్ ముఖ్యమంత్రినిత్యానంద స్వామికి ఉద్వాసన పలకాలని భారతీయ జనతా పార్టీ(బిజెపి) నిర్ణయించినట్లు తెలుస్తోంది.గద్దె దిగాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
నిత్యానంద స్వామి శనివారం హోం మంత్రిఎల్.కె. అద్వానీని కలిశారు. ఈ నెల 29వ తేదీ లోగా ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేయాలని అద్వానీ ఆయనకు చెప్పినట్లుసమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాంచల్ శాసనసభకు ఎన్నికలుజరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రినిమార్చాలనే యోచనలో బిజెపి కేంద్ర నాయకత్వంపడింది. ఈ విషయమై ఇప్పటికే నాయకత్వం పలువురు రాష్ట్రనాయకులతో సంప్రదింపులు జరిపింది.
Comments
Story first published: Saturday, October 27, 2001, 23:53 [IST]