ద్రావిడ్ కు గాయం - వాపస్ ఖాయం
కోల్ కతాః భారత వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మూడు నుంచి సౌతాఫ్రికాతో జరిగేటెస్ట్ సిరీస్ లో ఆడేదీ లేనిదీ అతని ఆరోగ్యపరిస్థితిపై పూర్తి నివేదికఅందాకే నిర్ణయిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ద్రావిడ్ గురించి తమకు సమాచారంఅందిందని, అయితే అతని భుజానికి అయిన గాయం గురించి పూర్తి వైద్య నివేదికఅందలేదని బిసిసిఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా బుధవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
ద్రావిడ్ ఒకటి రెండు రోజుల్లో మరో సారి వైద్య పరీక్షలు చేయించుకుంటాడని ఆ పరీక్షల గురించి నివేదికఅందిన తరువాత మాత్రమే అతడిన జట్టులో కొనసాగించేఅంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. భుజానికి తగిలిన గాయం చిన్నదే అని మొదట భావించినప్పటికీ దానిని లెక్కచేయకుండాటెస్ట్ సిరీస్ లో ఆడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ద్రావిడ్ ను పరీక్షించిన వైద్యులు చెప్పారు. సౌతాఫ్రికాపై ఇప్పటి వరకు చక్కటి ఇన్నింగ్స్ లు ఆడిన ద్రావిడ్ ట్రయాంగ్యులర్ సిరీస్ఫైనల్ లో సైతం భారత్ పరువు నిలిపాడు. ద్రావిడ్ జట్టులో లేకపోవడం భారత్ కు గట్టిదెబ్బగానే చెప్పుకోవాలి.