వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ పోరులో భారత్‌కు మద్దతు

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదంపై భారత్‌ సాగిస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును అమెరికా ప్రకటించింది. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో వున్నా దానిపై సమరానికి భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు. బుష్‌, వాజ్‌పేయి మధ్య శుక్రవారం నాడు వాషింగ్టన్‌లో ముఖాముఖి చర్చలు జరిగాయి. 40 నిుషాల పాటు జరిగిన చర్చల్లో కాశ్మీర్‌తో పాటు అఎn్గాన్‌ యుద్ధం, యుద్ధానంతర ప్రభుత్వం ఏర్పాటు వంటి అనేక షయాలు ప్రస్తావనకు వచ్చాయి.

ముఖాముఖి తర్వాత ఇరుదేశాల ప్రతినిధుల బృందం సమావేశం జరిగింది. ఉగ్రవాదంపై,సైబర్‌ టెర్రరిజంపై ఉమ్మడిగా పోరాడాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. భారత్‌ సందర్శించాల్సిందిగా జార్జ్‌బుష్‌ను ప్రధాని వాజ్‌పేయి ఆహ్వానించారు. చర్చల తర్వాత జరిగిన లేకరుల సమావేశంలో మాట్లాడుతూ,అక్టోబర్‌ 1న కాశ్మీర్‌ అసెంబ్లీపై జరిగిన బాంబు దాడులను అమెరికా ఖండించిందని ఆయన చెప్పారు.

టెర్రరిజం దుష్టశక్తి అని దానిని మట్టుబెట్టాల్సిన అవసరం వున్నదని యావత్‌ ప్రపంచం భాస్తున్నదని ఆయన చెప్పారు. కాశ్మీర్‌అసెంబ్లీ జరిగిన దాడిని స్వయంగా పాకిస్తాన్‌ కూడా ఖండించిన షయం వాజ్‌పేయి గుర్తుచేశారు. ఉగ్రవాదంపై చేస్తున్న యుద్ధం ఏ మతానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధం కాదని బుష్‌, తాను ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా వాజ్‌పేయి చెప్పారు.అఎn్గాన్‌లో యుద్ధానంతర ప్రభుత్వం ఏర్పాటుపై కూడా తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X