వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః చికిత్స పొందుతున్న ఒక మహిళా రోగి మరణించడంతో ఆమె బంధువులు డ్యూటీలో వున్న నర్సుపై చేయిచేసుకుని డాక్టర్‌ను కొట్టడానికి ప్రయత్నించిన సంఘటన ప్రతిష్టాత్మకమైన నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రెసిడెంట్‌ డాక్టర్ల సమ్మెకు దారితీసింది. నిందితులపై చట్టపరంగా కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెసిడెంట్స్‌ శనివారం నుంచి ధుల బహిష్కరణ మొదలుపెట్టారు.

By Staff
|
Google Oneindia TeluguNews

మరణించిన రోగి తాలూకు వ్యక్తులు తాము హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ బంధువులమని చెబుతూ ఆస్పత్రిలో హింసాకాండకు దిగారని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి చెల్లించాల్సిన 40 వేల రూపాయల బిల్లు ఎగవేతకే వారు ఈ ధంగా దౌర్జన్య కాండకు దిగివుంటారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా బడా నేతల బంధువులు గొడవలుపెట్టుకుని బిల్లులు ఎగవేసిన సందర్భాలు వున్నట్టుగా వారుచెప్పారు.

ఆస్పత్రి యాజమాన్యం గొడవలకు భయపడిఫీజులు మాఫీ చేయడాన్ని వారు ఖండించారు. కాగా డాక్టర్లు తమకు ఎప్పటికప్పుడు రోగుల బిల్లు షయం చెప్పితే ట్రిట్‌మెంట్‌ సమయంలోనే బిల్లు వసూలుకు dలుంటుందని వేలరూపాయలకుపేరుకుపోయిన తర్వాత రాయితీలు ఇవ్వాల్సివస్తున్నదని సంస్థ అధికారులు చెప్పారు. శనివారం నాడు జరిగిన సంఘటనకు సంబంధించి చోద్యం చూస్తూ కూచున్న ఇద్దరుసెక్యురిటీ ఉద్యోగులను సస్పెండ్‌ చేసినప్పటికీ సమ్మె చేస్తున్న డాక్టర్లు శాంతించలేదు. ప్రైవేట్‌సెక్యురిటీని పెట్టాలని, ఎమర్జెన్సీ వార్డుల్లోకి రోగుల బంధువులు చొచ్చుకురాకుండా చూడాలని డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X