శ్రీనగర్ః అఎn్గాన్ యుద్ధంలో పరాజయం పాలైన తాలిబన్ సైనికులు జమ్మూ కాశ్మీర్ దిశగా వచ్చే అవకాశం వున్నదని భారత సైనికాధికారులు భయపడుతున్నారు. అఎn్గాన్ యుద్ధంలో అమెరికాకు దన్నుగా నిలిచిన పాకిస్తాన్ తాలిబన్ సేనలు తమ భూభాగంలో అడుగుపెట్టనీయకపోవచ్చని అంటున్నారు.
పాకిస్తాన్ dరిని కాశ్మీర్ దిశగా మరల్చే అవకాశం వున్నదని చెబుతున్నారు. తాలిబన్లకు ప్రస్తుతం భూప్రపంచం dుద సురక్షితంగా వుండటానికిఏకైక స్థానం పాకిస్తాన్ మాత్రమేనని భారత రక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ వారిని తమ భూభాగంపైకి ఆహ్వానించే సాహసం చేయకపోవచ్చని వారు చెబుతున్నారు. బదులుగాపాక్ అక్రుత కాశ్మీర్ భూభాగంలోకి వారిని తరలించి అక్కడినుంచి భారత భూభాగంలో చొరపడేందుకు ప్రొత్సహించే అవకాశం వున్నదని చెబుతున్నారు.
ఈ పరిస్థితే వస్తే జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు పూర్తిగా చేయిదాటే ప్రమాదం వున్నదని సైనికాధికారులు భయపడుతున్నారు.అందువల్ల ముందుగా సరిహద్దుల వద్దనే గస్తీని ముమ్మరం చేసి చొరబాట్లను కఠినంగా నిరోధించాలని వారు భాస్తున్నారు. మామూలు ఉగ్రవాదుల్లా కాకుండా తాలిబన్సైనికులు యుద్ధాల్లో ఆరితేరిన వారు. అత్యాధునిక మారణాయుధాలు కలిగి వున్నవారు. వారు రాష్ట్రంలో ప్రవేశిస్తే దేశ అంతరంగిక భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడినట్టేనని సైనికాధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications