వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య ఈ నెల 24వ తేదీ నుంచి జరిగే మూడో క్రికెట్‌ టెస్టుకు మ్యాచ్‌ రెఫరీని మార్చాలనే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) త్రోసి పుచ్చింది. మూడో టెస్టుకు మైక్‌ డెన్నిస్‌ను మ్యాచ్‌ రెఫరీగా తొలగించబోమని ఐసిసి స్పష్టం చేసింది. భారత క్రికెటర్ల శిక్షను తగ్గించడం గురించి పరిశీలిస్తామని చెప్పింది. బిసిసిఐ డిమాండ్లను దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సమర్థించడం భారత్‌కు కొంత ఊరట. అయితే, డెన్నిస్‌ను తొలగించాలనే తమ డిమాండ్‌పై రాజీ పడే ప్రసక్తి లేదని బిసిసిఐ స్పష్టం చేసింది.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య ఈ నెల 24వ తేదీ నుంచి జరిగే మూడో క్రికెట్‌ టెస్టుకు మ్యాచ్‌ రెఫరీని మార్చాలనే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బిసిసిఐ) డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) త్రోసి పుచ్చింది. మూడో టెస్టుకు మైక్‌ డెన్నిస్‌ను మ్యాచ్‌ రెఫరీగా తొలగించబోమని ఐసిసి స్పష్టం చేసింది. భారత క్రికెటర్ల శిక్షను తగ్గించడం గురించి పరిశీలిస్తామని చెప్పింది. బిసిసిఐ డిమాండ్లను దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సమర్థించడం భారత్‌కు కొంత ఊరట. అయితే, డెన్నిస్‌ను తొలగించాలనే తమ డిమాండ్‌పై రాజీ పడే ప్రసక్తి లేదని బిసిసిఐ స్పష్టం చేసింది.

ఇదిలా వుంటే, జాతి వక్ష కారణంగానే భారత క్రికెటర్లపై కఠిన శిక్షలు వేశారని బిజెపి నాయకుడు .కె. మల్హోత్రా దుయ్యబట్టారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా భారత క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం న్యాయం కాదని ఆయన అన్నారు. భారత జట్టును వెనక్కి పిలిపించి ప్రతిష్టను కాపాడుకోవాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ అన్నారు. బిసిసిఐ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభుత్వం సమర్థిస్తుందని క్రీడల మంత్రి ఉమాభారతి అన్నారు. భారత్‌ క్రికెటర్లకు వేసిన శిక్షలపై బిసిసిఐ నుంచి నివేదక కోరినట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X