వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిః చిత్తూరు జిల్లా కంభంవారి పల్లెలో రెండు రోజులుగాపీపుల్స్ వార్ నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఒక నక్సలైట్ మరణించినట్లు పోలీసులువివరించారు. పీలేరులో చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ప్లాంట్ నుపేల్చి వేసిన అనంతరం పోలీసులు జిల్లాలో పెద్దఎత్తున కూంబింగ్ చర్యలు చేపట్టారు. ఈ కూంబింగ్ చర్యలలో పున్నాలగుట్ట అడవిలో వున్న 11 మంది నక్సలైట్లను పోలీసులు గుర్తించి వెంటనే అడవిని చుట్టుముట్టారు.
ఆదివారం రాత్రి నుంచి పోలీసులు నక్సలైట్లుకు మధ్య కాల్పులు జరుగుతునే వున్నాయి. నక్సలైట్లను దిగ్బంధం చేసే సంకల్పంతో వందలాది మంది పోలీసులను అడవికి నాలుగు వైపులా తరలించారు. నక్సలైట్లను పట్టుకు తీరుతామని జిల్లా ఎస్.పి. చెప్పారు.
Comments
Story first published: Tuesday, December 4, 2001, 23:53 [IST]