వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులోపదిమంది పాక్‌ సైనికుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః సరిహద్దులో భారత్‌ - పాక్‌ సేనల మధ్య మంగళవారం కూడా కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో పదిమంది వరకు పాకిస్తాన్‌ సైనికులు మరణించారు. 9 పాకిస్తాన్‌ బంకర్లను భారత్‌ సేనలు ధ్వంసం చేశారు. పూంఛ్‌ సెక్టర్‌ లో భారత్‌ వ్యూహాత్మకంగా పాక్‌ బంకర్లపై దాడులు నిర్వహిస్తున్నది. పూంఛ్‌, రాజోరి సెక్టర్లు మంగళవారం కాల్పుల మోతతో హోరెత్తిపోయాయి.

లష్కర్‌ - ఎ-తోయిబా తీవ్రవాదులు సోమవారం రాత్రి పూంఛ్‌ ప్రాంతంలో ఆరుగురు హిందువులను కాల్చి చంపారు. దీనితో పూంఛ్‌, రాజోరీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పూంఛ్‌ లో బంద్‌ పాటించారు. ఈ సంఘటనతో పాటు తీవ్రవాద చర్యల్లో సోమవారం నాడే 9 మంది మరణించారు.

సరిహద్దులో భారత్‌ పెద్దఎత్తున సైన్యాన్ని మొహరించడమే ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమని పాక్‌ ఆరోపించింది. తీవ్రవాద నేతల్ని అరెస్టు చేశామని, సాక్ష్యాలు చూపితే వారిని భారత్‌ కు అప్పగించేందుకు అభ్యంతరం లేదని చెప్పినా భారత్‌ ఇలా సేనల్ని మొహరించిందని పాక్‌ ధ్వజమెత్తింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X