వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ కు ఓ ఛాన్స్‌ ఇవ్వండిఃబుష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః పాకిస్తాన్‌ లోని తీవ్రవాదులను శిక్షించేందుకు ముషారఫ్‌ కు ఓ అవకాశం ఇవ్వాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బుష్‌ భారత ప్రధాని వాజ్‌ పేయిని కోరారు. సంయమనం పాటించడం వల్ల ఉభయ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించే అవకాశం వుందని బుష్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం నాడు టెక్సాస్‌ లో మాట్లాడుతూ తీవ్రవాదులను శిక్షించేందుకు పాకిస్తాన్‌ తీసుకుంటున్న చర్యలను బుష్‌ ప్రశంసించారు. తీవ్రవాదుల్ని ఏరివేసే దిశగా పాక్‌ తీసుకుంటున్న చర్యలు నిజంగా హర్షణీయం అని ఆయన అన్నారు. వాజ్‌ పేయితో జరిపిన ఫోన్‌ సంభాషణను బుష్‌ వివరిస్తూ భారత పార్లమెంటుపై తీవ్రవాదులు దాడి జరపడం న్యూయార్క్‌ పై దాడి జరపడం వంటిదేనని చెప్పనట్లు తెలిపారు.

ఇంతటి తీవ్రమైన దాడికి గురైన వారి మనోభావాలు ఎలా వుంటాయో గ్రహించగలమని అయితే అది యుద్ధానికి దారి తీయకూడదని వాజ్‌ పేయికి చెప్పినట్లు బుష్‌ చెప్పారు. తీవ్రవాదుల్ని శిక్షించేందుకు ముషారఫ్‌ కు ఓ అవకాశం ఇచ్చి చూడాల్సిందిగా కూడా వాజ్‌ పేయిని అభ్యర్థించినట్లు ఆయన చెప్పారు. లష్కర్‌-ఎ-తొయిబా, జైషే మహమ్మద్‌ ప్రముఖ నేతల్ని ముషారఫ్‌ అరెస్టు చేసిన విషయాన్ని కూడా వాజ్‌ పేయికి గుర్తు చేసినట్లు ఆయన వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X