వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిజంపై భారత్‌విజయం ఖాయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః టెర్రరిజం పై ఎక్కుపెట్టిన పోరులో భారత్‌నే విజయలక్ష్మి వరిస్తుందని ప్రధాని వాజ్‌పేయి చెప్పారు. పాకిస్తాన్‌ తన భారత వ్యతిరేక వైఖరిని విడనాడి సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెబితే ఉపఖండంలో శాంతస్థాపనకు భారత్‌ శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నూతన సంవత్సరాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రధాని ప్రత్యేకంగా ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో సరిహద్దులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్న జవాన్లకు, కీలక స్థావరాలను రేయింబవళ్లు కాపాడుతున్న భద్రతాదళాలకు, ఆహారభద్రతకోసం పరిశ్రమిస్తున్న రైతులకు, దేశ ఆర్ధిక రంగాన్ని పటిష్టంగా నిలిపివుంచుతున్న కార్మికులు, మేనేజర్లకు, దేశవిదేశాల్లో భారతీయ కీర్తిపతాకను ఎగురవేసిన సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు, భావిభారత పౌరులకు, యువజనులకు జాతినిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్న ప్రతి భారతీయునికి శుభాకాంక్షులు తెలియజేస్తున్నట్టుగా ప్రధాని చెప్పారు. కొత్త సంవత్సరం శాంతి సౌభాగ్యాలను కొనితేవాలని ఆయన ఆకాంక్షించారు.

ఎన్ని అవరోధాలున్నా మాతృభూమితో సజీవ సాంస్కృతిక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రవాస భారతీయులు, విదేశాల్లోని భారతీయ సంతతి వ్యక్తులకు ఆయన అభినందనలు తెలియజేశారు. గడచిన సంవత్సరం దేశం అనేక సంక్షోభాలను చవిచూసిందని, గుజరాత్‌ భూకంపం, సంవత్సరాంతంలో పార్లమెంట్‌ భవనంపై టెర్రరిస్టు దాడి దేశాన్ని దిగ్భ్రాంతి పర్చాయని ఆయన చెప్పారు. సంక్షోభాలను ఆపదలను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఎదుర్కోవడం భారత్‌కు అలవాటేనని ఆయన చెప్పారు. మనపై మనకున్న విశ్వాసంతో భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా తిప్పిగొట్టాలని జాతి ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. టెర్రరిజం పై సాగుతున్న పోరులో నిర్ణయాత్మక విజయం భారత్‌నే వరిస్తుందని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X