వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ శాంతి జపం!

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః భారత పాకిస్తాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని నివారించేందుకు పాకిస్తాన్‌ సైనికాధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ నడుం కట్టారు. జనవరి నాలుగున ఖాట్మండూలో ప్రారంభం కానున్న సార్క శిఖరాగ్ర సదస్సును ముషారఫ్‌ తన ప్రయత్నాలకు వేదికగా ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. సార్క్‌ శిఖరాగ్రం సందర్భంగా వాజ్‌ పేయి-ముషారఫ్‌ చర్చలు జరిపే అవకాశం వుందనే ఊహాగానాలు ఊపందుకున్న తరుణంలో ముషారఫ్‌ శాంతి యత్నాలు జరపడం విశేషం. అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌, బ్రిటన్‌ ప్రధాని టోనీ బ్లెయిర్‌ , శ్రీలంక అధ్యక్షురాలు, సార్క్‌ సారధి చంద్రికా కుమారతుంగతో ముషారఫ్‌ ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు జరిపారని వినికిడి.

వారితో పాటు పలువురు ప్రపంచ దేశాల నేతలతో కూడా ముషారప్‌ సంప్రదింపులు జరుపుతున్నారని పాకిస్తాన్‌ అధికార వార్తా పత్రిక బుధవారం ప్రకటించింది. పాక్‌ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నప్పటికీ భారత్‌ సరిహద్దు వద్ద సైన్యాన్ని మొహరిస్తున్నదనే అంశాన్ని ముషారఫ్‌ పనిలో పనిగా ప్రపంచదేశాల నేతల చెవిలో ఊదుతున్నారు. తద్వారా వారి వద్ద తను మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు భారత్‌ ను అప్రతిష్ఠ పాలు చేయడం ముషారఫ్‌ పన్నాగం కనిపిస్తున్నదని దౌత్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కార్యదర్శి కోఫి అన్నన్‌, జోర్డాన్‌, లెబనాన్‌ దేశాధినేతలతో కూడా ముషారఫ్‌ సంప్రతింపులు జరిపినట్లు భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X