వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మభూమి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః 16వ విడత జన్మభూని కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో ప్రజలు స్థానిక సమస్యలపై అధికారులను నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్ల్యేలు తమ నియోజక వర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జన్మభూమితో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవ వాతావరణం నెలకొన్నది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని మేడికొండూరూలో 19లక్షల వ్యయంతో నిర్మించిన ఎం.డి.ఓ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న తిరుపతి, హిందూపురం, హైదరాబాద్‌, రాజమండ్రిలలో జన్మభూమి నిర్వహించలేదు. విజయవాడలో జన్మభూమి అధికారులను వామపక్షాల నాయకులు వివిధ సమస్యలపై నిలదీశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న ప్రాంతాల్లో ప్రజలు అధికారులకు వివిధ సమస్యలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. అధికార పార్టీ ఎమ్మెల్ల్యేలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X