వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు కమ్యూనికేషన్లకుపెద్దపీట

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పోలీసు విభాగంలో ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గురువారం నాడిక్కడ, అఖిల భారత పోలీసు రేడియో అధికారుల సదస్సుకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సదస్సు మూడురోజుల పాటు జరుగుతుంది.

పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కంటే నేరగాళ్లు, సంఘవిద్రోహులు, కిడ్నాపర్లు, భూ ఆక్రమణదారులు ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆధునిక కమ్యూనికేషన్ల వ్యవస్థ అందిస్తున్న సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే అనేక నేరాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు. పోలీసు రేడియో అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లను అనుసంధానం చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. 2000 కోట్ల రూపాయలతో పోలీసు కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునీకరించనున్నట్టుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు చెప్పారు. సదస్సులో రాష్ట్ర హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ కూడా ప్రసంగించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X