వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు చైనా భరోసా

By Staff
|
Google Oneindia TeluguNews

ఖాట్మండుః భారత్‌ ఎలాంటి హెచ్చరికలు లేకుండా యుద్ధ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ భద్రతకు ప్రమాదం ఏర్పడిందని పాకిస్తాన్‌ ఆరోపించింది. అయితే తమకు అన్ని విధాలా అండదండలు అందించడానికి చైనా హామీ ఇచ్చిందని పాక్‌ పేర్కొంది.

పాక్‌ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని చైనా హామీ ఇచ్చినట్టుగా పాకిస్తాన్‌ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ రషీద్‌ ఖురేషీ ఖాట్మండులో చెప్పారు. పాకిస్తాన్‌ అధ్యక్షుడు జనరప్‌ ముషారఫ్‌ చర్యలను చైనా పూర్తిగా సమర్ధించిందని ఆయన చెప్పారు. ఖాట్మండు రావడానికి ముందు ముషారఫ్‌ చైనా వెళ్లి చైనా నేతలను కలిసారని పాక్‌కు అన్ని వేళల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X