ఖాట్మండుః సార్క్ దేశాల అధినేతల 16వ శిఖరాగ్ర సమావేశాలు శనివారం నాడు ప్రారంభయ్యాయి. సార్క్ కొత్త చైర్మన్గా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఎన్నికయ్యారు.
ప్రస్తుత సార్క్ చైర్మన్ శ్రీలంక అధ్యక్షురాలు చంద్రిక కుమార తుంగ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత సార్క్ సిట్టింగ్ ఛైర్పర్సన్ చంద్రిక కుమార తుంగ సమావేశాలను ప్రారంభించిన తర్వాత రాజు బీరేంద్ర మృతికి సంతాపం తెలియజేస్తూ సమావేశం ఒక నిమిషం పాటు మౌనం పాటించింది. సమావేశాల ఎజెండాను ఆమోదించిన తర్వాత కొత్త చైర్మన్ అధ్యక్షతన సమావేశాలను ప్రారంభించారు.