వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లెయిర్‌ ను అలరించిన తెలుగుపల్లె

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌ః మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని మారుమూల గ్రామం బ్రిటన్‌ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్‌ ను అలరించింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ లో బ్లెయిర్‌ సతీసమేతంగా వట్టెం గ్రామం చేరుకున్నారు. వట్టె గ్రామం బ్లెయిర్‌ దంపతులకు సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికింది. వట్టెంలో బ్రిటన్‌ నిధులతో నిర్మించిన బాలికల ప్రాధమిక పాఠశాల ను బ్లెయిర్‌ ప్రారంభించారు.

ఆతరువాత డిఎఫ్‌ఐడి నిధులతో అమలవుతున్న పథకాల తీరును బ్లెయిర్‌ పరిశీలించారు. ఆంధ్రరాష్ట్రంలో డ్వాక్రా మహిళా పథకం బ్లెయిర్‌ ను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత బ్లెయిర్‌ పాఠశాల విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం డ్వాక్రా పథకం, ప్రాధమిక విద్యా పథకాలపై ఏర్పాటు చేసిన పవర్‌ పాయింటి ప్రజంటేషన్‌ ను బ్లెయిర్‌ తిలకించారు. ఈ సందర్భంగా బ్లెయిర్‌ మాట్లాడుతూ భారత దేశంలో విద్య, వైద్య పథకాలకు బ్రిటన్‌ సాయంకొనసాగుతుందన్నారు. వట్టం గ్రామస్తుల తరపున బ్లెయిర్‌ దంపతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు.

అనంతరం బ్లెయిర్‌ హెలికాప్టర్‌ లో నేరుగా బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి పోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X