వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌ పేయి స్థాయిలో అద్వానీకి భద్రత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీకి ప్రధానితో సమాన హోదాలో భద్రత కల్పించారు. అద్వానీని హత్య చేసేందుకు పాక్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ ఐఎస్‌ఐ కుట్రపన్నిందనే విషయాన్ని భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలు కనిపెట్టాయి. ఈ మేరకు తీవ్రవాదుల మధ్య జరిగిన సంభాషణను ఇంటిలిజెన్స్‌ వర్గాలు డీ కోడ్‌ చేశాయి. అద్వానీని కారులో ప్రయాణిస్తున్న సమయంలో మట్టుపెట్టాలని తీవ్రవాదులు కుట్రపన్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో అద్వానీకి భారత చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రధానితో సమానంగా రక్షణ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇదిలా వుండగా పాకిస్తాన్‌ తీవ్రవాదానికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నదో వివరించేందుకు అద్వానీ సోమవారం నుంచి ఐదురోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. భారత పార్లమెంటుపై డిసెంబర్‌ 13న దాడి జరిగిన తరువాత అద్వానీ జరుపుతున్న అమెరికా యాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం నాడు అద్వానీ విలేకరులతో మాట్లాడుతూ తీవ్రవాద వ్యతిరేక యుద్ధం తుది దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X