వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్ పేయి స్థాయిలో అద్వానీకి భద్రత
న్యూఢిల్లీః దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అద్వానీకి ప్రధానితో సమాన హోదాలో భద్రత కల్పించారు. అద్వానీని హత్య చేసేందుకు పాక్ ఇంటిలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కుట్రపన్నిందనే విషయాన్ని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. ఈ మేరకు తీవ్రవాదుల మధ్య జరిగిన సంభాషణను ఇంటిలిజెన్స్ వర్గాలు డీ కోడ్ చేశాయి. అద్వానీని కారులో ప్రయాణిస్తున్న సమయంలో మట్టుపెట్టాలని తీవ్రవాదులు కుట్రపన్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో అద్వానీకి భారత చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రధానితో సమానంగా రక్షణ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]