వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాకెట్లతో దాడి చేసిన పాక్ దళాలు
జమ్ముః భారత దళాలపై పాక్ సేనలు సోమవారం ఉదయం మెరుపుదాడి చేశాయి. పూంఛ్ ప్రాంతంలో పాక్ దళాలు భారత్ స్థావరాలపై మోర్టార్లు, రాకెట్ల, యాంటీ ట్యాంక్ షెల్స్ తో దాడి చేశాయి. మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లతో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూంఛ్ లోని దిగ్వార్, ఖాండు, కర్మేరా, గుల్ పూర్ గ్రామాలపై దాడి చేసినట్లు భారత సైనికవర్గాలు తెలిపాయి.
పాక్ దాడులను ముమ్మరం చేయడంతో వాస్తవాధీన రేఖ ప్రాంతం నుంచి సుమారు రెండు వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం సాయంత్రానికి కూడా పాక్ సేనలు మోర్టార్లతో దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందింది. పాక్ దాడులకు భారత్ దళాలు కూడా తగిన రీతిలో సమాధానం చెప్పాయి. పూంఛ్ సెక్టర్ తో పాటు సరిహద్దు వెంబటి పలు ఇతర సెక్టార్లలో కూడా పెద్దఎత్తున కాల్పులు జరిగుతున్నట్లు సమాచారం అందింది.
Story first published: Wednesday, May 19, 2010, 13:30 [IST]