వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ తో చర్చల ప్రసక్తి లేదుః భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఉగ్రవాదానికి స్వస్తి చెప్పేందుకు నిరాకరిస్తూ నాటకాలాడుతున్న పాకిస్తాన్‌ తో చర్చల ప్రసక్తి లేదని భారత్‌ మరోమారు తేల్చి చెప్పింది. ప్రధాని వాజ్‌ పేయి సార్క్‌ పర్యటన అనంతరం సోమవారం నాడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. గంటన్నర పాటు సాగిన సమావేశంలో ప్రధాని వాజ్‌ పేయి, హోం మంత్రి అద్వానీ తదితరులు పాల్గొన్నారు.

తమ డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గని పాకిస్తాన్‌ తో చర్చలు జరపరాదని సమావేశంలో నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌ విలేకరులకు చెప్పారు. ఆదివారం నాడు భారతభూభాగంలోకి వచ్చిన పాక్‌ విమానాన్ని భారత్‌ సేనలు కూల్చివేసినట్లు కూడా జస్వంత్‌ సింగ్‌ ప్రకటించారు. అనుమతిలేకుండా భారత భూభాగంలోకి వచ్చినందుకే ఆవిమానాన్ని కూల్చివేశామని ఆయన చెప్పుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X