అకాల వర్షాల నష్టం రూ. 20 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల మేరకు పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర సహాయ పునరావాస శాఖ ఉన్నతాధికాలు చెప్పారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, నష్టం ఇంకా ఎక్కువ వుండవచ్చునని వారంటున్నారు.
ఇదిలా వుంటే, మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం వున్నదని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వర్షాలు తగ్గుతాయని వారంటున్నారు. చలి మరింత తీవ్రమవుతుందని, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వారు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications