వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలో బిస్మిల్లాఖాన్‌ కు అవమానం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః భారతరత్న, ప్రపంచప్రఖ్యాత షెహనాయ్‌ విద్యాంసుడు బిస్మిల్లా ఖాన్‌ కు తెలుగునేలపై తీరని అవమానం జరిగింది. ఎపిటూరిజం శాఖ నాలుగురోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో బిస్మిల్లా ఖాన్‌ కార్యక్రమం కూడా వున్నట్లు ప్రచారం చేశారు. బుధవారం జరిగాల్సిన బిస్మిల్లా ఖాన్‌ కార్యక్రమాన్ని చివరిక్షణంలో రద్దు చేశారు. చివరకు ఆయనకు దారిఖర్చులు కూడా ఇవ్వకుండా ఎ.పి.టూరిజం శాఖ చేతులు దులుపుకుంది. ఎ.పి.కళావేదిక కన్వీనర్‌ రమణమూర్తి టూరిజం శాఖ తరపున బిస్మిల్లా ఖాన్‌ తో మాట్లాడి హైదరాబాద్‌ లో ప్రోగ్రాం ఇచ్చేందుకు ఒప్పించారు. బిస్మిల్లా ఖాన్‌ తన బృందంతో సహా హైదరాబాద్‌ నగరం చేరుకొని ఓ హోటల్‌ లో బసచేశారు.

పర్యాట శాఖ వారు ఎవరూ రాకపోగా మీ ప్రోగ్రాం లేదు పొమ్మంటూ కబురు పంపించారు. సుమారు ఐదు లక్షలు ఖర్చు చేసుకొని తన బృందంతో ప్రయాణం అయి వచ్చిన తనను ఆంధ్రరాష్ట్రం అవమానించిందని బిస్మిల్లా ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇంతటి పరాభవం ఎన్నడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతరత్న, మహోన్నత కళాకారుడు బిస్మిల్లా ఖాన్‌ ను ఈ విధంగా అవమానించండం నిజంగా సిగ్గుచేటని కళాభిమానులు విమర్శిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X