నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో నిషిద్ధ పీపుల్స్వార్ నక్సలైట్ మరణించాడు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా కమ్మర పల్లి మండలం షేర్బాగ్ గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు నక్సల్స్ కాల్పులు జరిపారు.వెంటనే అప్రమత్తులైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరో నక్సలైట్ పారిపోయాడు.