వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చేనెల తిరుమల రోప్‌ వే ప్రారంభం

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః ప్రపంచప్రసిద్ధి గాంచిన తిరుమలకు ఫ్రిబ్రవరి నెలలో రోప్‌ వే నిర్మాణం పనులు చేపట్టనున్నారు. సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టును ఏడాదిన్నర లోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రపంచంలోనే ఇది ప్రతిష్ఠాత్మకమైన రోప్‌ వే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ సిఎండి ఆంజనేయరెడ్డి బుధవారం చెన్నయ్‌ లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా బుధవారం చెన్నయ్‌ లో నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు.

సుమారు 200 వందల కేబుల్‌ కార్లు నిరంతరం తిరుమల-తిరుపతి మధ్య తిరుగుతాయని ఆయన చెప్పారు. 8 నుంచి 30 మంది వరకు ఒకొక్క కేబుల్‌ కారులో తిరిగే అవకాశం వుందన్నారు. ఈ రోప్‌ వే వల్ల తిరుమల చేరుకొనేందుకు ప్రస్తుతం పడుతున్న సమయంలో సగం సమయంలోనే ఆ ఏడుకొండల వాడిని చేరుకోవచ్చు. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలలో కూడా రోప్‌ వేలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X