వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక పాక్‌ మోసాలు సాగవుః అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః పాక్‌ చేతిలో మరోసారి మోసపోదలచుకోలేదని భారత హోం శాఖ మంత్రి ఎల్‌.కె.అద్వానీ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగమంత్రి కొలెన్‌ పావెల్‌ తో గురువారం ఆయన చర్చలు జరిపారు. ఆతరువాత అద్వానీ, పావెల్‌ ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌ వైఖరి అర్థం చేసుకోతగిందేనంటూ పావెల్‌ పరోక్షంగా పాక్‌ ను సమర్థించారు. పాక్‌ తీవ్రవాదులపై సత్వరం చర్యలు తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్‌ లో వున్న తీవ్రవాదుల జాబితాను భారత్‌ తనకు అందించిందని, ఈ జాబితాలో వున్న వ్యక్తులపై పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ చర్యలు ప్రారంభించే వుంటారంటూ పావెల్‌ ముషారఫ్‌ ను వెనకేసుకు వచ్చేందుకు ప్రయత్నించారు.ఉద్రిక్తతల నివారణకు వచ్చే వారం భారత్‌, పాక్‌ లలో పర్యటించనున్నట్లు పావెల్‌ చెప్పారు.

ఆ తరువాత మాట్లాడిన అద్వానీ మాత్రం కరాఖండిగా మాట్లాడారు. ఇప్పటికే పాక్‌ చేతిలో పలుసార్లు మోసపోయామని, మరోసారి మోసపోయేందుకు సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. తాము కోరిన విధంగా 20 మంది తీవ్రవాదుల్ని అప్పగించాలని, సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని అద్వానీ పాక్‌ ను డిమాండ్‌ చేశారు. జమ్మూ కాశ్మీర్‌ లో తీవ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా పాక్‌ ఎన్ని హితోక్తులు పలికినా భారత్‌ పట్టించుకోబోదని కూడా అద్వానీ స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X