వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు పాక్‌లోని తీవ్రవాదుల జాబితా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ నుంచి పని చేస్తున్న 42 మంది టెర్రరిస్టుల జాబితాను భారత హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ బుధవారం అమెరికా అటార్నీ జనరల్‌ జాన్‌ అష్క్రాఫ్ట్‌కు అందజేసినట్లు ఒక టెలివిజన్‌ నెట్‌వర్క్‌ వార్తను ప్రసారం చేసింది.

ఇంతకు ముందు భారత్‌ అందజేసిన 20 మంది పేర్లతో పాటు అఎn్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌కు చెందిన 14 మంది పేర్లు అమెరికా అటార్నీ జనరల్‌కు అందజేసిన జాబితాలో వున్నాయి. ఈ 14 మంది అఎn్ఘానిస్థాన్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయినట్లు పారిపోయినట్లు చెబుతున్నారు.

1993 ముంబాయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్‌ ఇబ్రాహీం, జైష్‌- ఎ- మహ్మద్‌ ఛీఫ్‌ మసూద్‌ అజర్‌, హిజుబుల్‌ ముజాహిదీన్‌ ఛీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ పేర్లతో పాటు ఏడుగురు పంజాబ్‌ ఉగ్రవాదుల పేర్లు వున్నట్లు ఆ టెలివిజన్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. ఈ జాబితాలో వ్యక్తుల కార్యకలాపాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా అద్వానీ అమెరికా అటార్నీ జనరల్‌కు అందజేశారు.

తాలిబాన్‌ నేతల జాబితాలో తాలిబాన్‌ పాలనలో ఛీఫ్‌ జస్టిస్‌గా వున్న మౌల్వీ నూర్‌ మొహమ్మద్‌ సఖీబ్‌, ఆయన డిప్యూటీగా పని చేసిన మౌల్వీ ముసాజమ్‌ పేర్లు వున్నాయి. వీరిద్దరు కూడా పెషావర్‌లో వున్నట్లు భావిస్తున్నారు. తాలిబాన్‌ పాలనలోని ఏడుగురు మంత్రులు, ఇద్దరు ప్రొవిన్షియల్‌ గవర్నర్లు ఈ జాబితాలో వున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X