వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ మోసాలను సహించం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: తమ సహనాన్ని పరీక్షిస్తున్న పాకిస్థాన్‌ మరో మోసాన్ని భరించబోదని భారత హోం మంత్రి ఎల్‌.కె. అద్వానీ అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో పాకిస్థాన్‌ ప్రతిసారీ తమ ప్రగాఢ సంయమనాన్ని మోసంతో పరీక్షిస్తోందని ఆయన అన్నారు.

అమెరికా అటార్నీ జనరల్‌ జాన్‌ అష్క్రాఫ్‌, విదేశాంగ మంత్రి కాలిన్‌ పావెల్‌, సెంట్రల్‌ ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జార్జ్‌ టెనెట్‌లతో సమావేశమైన అనంతరం ఆయన భారత దౌత్య కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారత పార్లమెంటుపై దాడి జరిగిన వెంటనే అది భారత చర్యేనని పాకిస్థాన్‌ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జైష్‌- ఎ- మహ్మద్‌, లష్కర్‌- ఎ- తోయిబా తమ పార్లమెంటుపై దాడి చేశాయని భారత్‌ కాశ్మీర్‌ స్వాతంత్ర్య పోరాటాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రకటిస్తోందని రెండు రోజుల తర్వాత పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి అన్నారని ఆయన చెప్పారు.

భారత్‌ చేసిన న్యాయబద్ధమైన డిమాండ్లకు అనుకూలంగా స్పందించడం ద్వారా పాకిస్థాన్‌ తన నిజాయితీని రుజువు చేసుకోవాలని ఆయన అన్నారు. భారత్‌ కోరుతున్న 20 మంది ఉగ్రవాదులను అప్పగించాలని, పాకిస్థాన్‌లోని శిక్షణా శిబిరాలను, సౌకర్యాలను మూసివేయాలని, ఆయుధాల, డబ్బు పంపిణీని నిలిపేయాలని, పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ఆయుధాలను, మనుషులను చేరవేయడాన్ని ఆపేయాలని ఆయన పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X