వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముషారఫ్‌ ప్రసంగంపైనే అందరి కళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఉగ్రవాద నిర్మూలకు పాకిస్తాన్‌ తీసుకుంటున్న చర్యలపై పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ ఈ నెల 13,14 తేదీల్లో దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి. భారత-పాక్‌ ల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొనడం, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా సైతం పాక్‌ పై కొంతమేరకు ఒత్తడి తీసుకు వస్తున్న తరుణంలో ముషారఫ్‌ ప్రసంగంపైనే ప్రపంచదేశాల దృష్టి అంతా వుంది. ముషారఫ్‌ ప్రసంగం భారత -పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తోడ్పడగలదని వివిధ దేశాధినేతలు ఆశాభావంతో వున్నారు.

ముషారఫ్‌ దేశప్రజలను ఉద్దేశించి ఎప్పుడు ప్రసంగించేందీ ఖచ్చితంగా చెప్పకపోయినప్పటికీ పాక్‌ కు చెందిన ది నేషన్‌ పత్రిక మాత్రం 13,14 తేదీల్లో ముషారఫ్‌ మాట్లాడే సూచనలున్నట్లు పేర్కొన్నది. తీవ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని ముషారఫ్‌ ఈ సందర్భంగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించే ఆవకాశం వుంది. తీవ్రవాదాన్ని సమర్థిచండతోపాటు వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా ఆ తీర్మానం ప్రకారం నేరం అవుతుంది. కాశ్మీర్‌ వ్యవహారంపై ముషారఫ్‌ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపైనా భారత-పాక్‌ భవిష్యత్‌ సంబంధాలు ఆధారపడి వుంటాయని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X